Manisha Koirala | బ్రిటన్ ప్రధాన మంత్రి (UK PM) రిషి సునాక్ (Rishi Sunak)ను బాలీవుడ్ స్టార్ నటి మనీషా కోయిరాల (Manisha Koirala ) కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటి ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. యూకే – నేపాల్ బంధానికి (UK – Nepal Friendship) 100 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ (10 Downing Street)లో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మనీషా కోయిరాల నేపాల్ తరఫున హాజరయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను నటి షేర్ చేస్తూ.. ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. నేపాల్ గురించి బ్రిటన్ ప్రధాని ఎంతో అభిమానంగా మాట్లాడటం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు ట్రెక్కింగ్కు రావాలని పీఎం, ఆయన కుటుంబాన్ని ఆహ్వానించినట్లు మనీషా కోయిరాల తన పోస్ట్లో వెల్లడించారు.
కాగా, కొన్నేళ్ల విరామం తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’లో మనీషా కోయిరాల కనిపించారు. ఈ సినిమాలో మల్లికాజాన్ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆమెతోపాటు సొనాక్షి సిన్హా, రిచా చద్ధా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్, అదితిరావ్ హైదరి, తదితరులు కీలపాత్రలు పోషించారు.
Also Read..
Deepfake | డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో రిలీజ్ చేసిన కేంద్రం
Anant Weds Radhika | ఇటలీ టు స్విట్జర్లాండ్.. భారీ క్రూయిజ్లో అనంత్ వివాహం
Schengen Visa | షెన్జెన్ వీసా ఫీజు 12 శాతం పెంపు.. భారతీయులపై తీవ్ర ప్రభావం