ముంబై : స్వచ్ఛమైన ప్రేమ ఇంకా మిగిలేఉందని నిరూపించే ఘటనకు ముంబై ఈటరీ వేదికగా నిలిచింది. దేశ వాణిజ్య రాజధానిలోని ఓ రెస్టారెంట్లో వృద్ధ దంపతులు డ్రింక్ను షేర్ చేసుకున్న వీడియో (Viral Video) తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వృద్ధ దంపతుల అన్యోన్యతకు ఈ వీడియో అద్దం పడుతున్నదని నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ప్రివి పిక్చర్స్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది.
ఈ వీడియోలో వృద్ధ దంపతులు బీరు గ్లాస్ను షేర్ చేసుకోవడం కనిపిస్తుంది. ముంబై రెస్టారెంట్లో ఈ వీడియోను చిత్రీకరించారు. జీవితంలో ఎన్నో ఏండ్లు కలిసి ప్రయాణించిన తర్వాత చల్లటి బీర్ను పంచుకోవడం ఆనందకరమైన క్షణాలను ఆస్వాదించడమేనని పోస్ట్లో రాసుకొచ్చారు.
భారత్లో బీర్ గ్లాస్ను వృద్ధ దంపతులు షేర్ చేసుకోవడం మామూలు విషయం కాదు..తాము ఈ అన్యోన్య దంపతులను ముంబై రెస్టారెంట్లో చూశామని, వీరిని ఫొటో తీసుకునేందుకు తాము అనుమతి కోరామని..వారి జీవితానుభవాలను వినేందుకు ఎంతో సంతోషించామని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 60 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి. ఈ స్వీట్, క్యూట్ క్లిప్ను నెటిజన్లు అమితంగా ఇష్టపడుతూ వృద్ధ దంపతుల అన్యోన్యతకు ముగ్గులయ్యారు. వీరు ఇలాగే కలకాలం ప్రేమానురాగాలతో కలిసిఉండాలని నెటిజన్లు కామెంట్ చేశారు.
Read More :