Sachi joshi | టాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది. మొత్తం రూ. 410 కోట్ల ఆస్తులను జప్తు ఈడీ చేసింది. ఇందులో రూ.330 కోట్ల వరకు ఓంకార్ గ్రూప్నకు చెందిన ఆస్తులు కాగా.. మిగిలిన రూ. 80 కోట్లు వైకింగ్ గ్రూప్ కంపెనీకి చెందినవని ఈడీ వెల్లడించింది. ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో భాగంగా సచిన్ జోషికి చెందిన ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈ అక్రమాలపై గతంలో ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది.
సచిన్ జోషి 2002లో వచ్చిన మౌనమేలనోయి సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, నీజతగా నేనుండాలి, వీడెవడు వంటి తెలుగు సినిమాల్లో నటించాడు. బాలీవుడ్లోనూ పలు సినిమాలు చేశాడు. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వీరప్పన్ హిందీ వర్షన్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ నటించాడు. తెలుగులో తమన్నా హీరోయిన్గా వచ్చిన నెక్ట్స్ ఏంటి సినిమాను కూడా నిర్మించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Bangarraju Review | ‘బంగార్రాజు’ రివ్యూ
భీమ్లా నాయక్ రిలీజ్పై మరోసారి క్లారిటీ.. అదిరిపోయిన నయా పోస్టర్
నాగార్జున నమ్మకమే నిజమైంది.. బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన బంగార్రాజు..
వాళ్లిద్దరూ నా వల్ల విడిపోలేదు.. షణ్ముఖ్, దీప్తి బ్రేకప్పై స్పందించిన సిరి