న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో దేశవ్యాప్తంగా మరోసారి కోడిగుడ్లకు డిమాండ్ పెరిగింది. రిటైల్ మార్కెట్లో ఒక కోడిగుడ్డు రూ.6-7 పలుకుతున్నది. బర్డ్ ఫ్లూ వల్ల గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.5లకే అందుబాటులో ఉండేది. బర్డ్ ఫ్లూ వల్ల గుడ్ల ఉత్పత్తి, వాడకంపై ప్రతికూల ప్రభావం పడింది.
కోడిగుడ్డులో 11 శాతం ప్రోటీన్లు లభిస్తున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ప్రోటీన్లు లభిస్తున్నది కోడిగుడ్డులోనే. కోవిడ్-19 బారిన పడ్డ రోగులకు ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న కోడిగుడ్లు తప్పక ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కోడిగుడ్ల వినియోగం పెరిగింది.
బర్డ్ ఫ్లూ టైంలో డిమాండ్ తగ్గినా.. కరోనా వల్ల వ్యక్తులు నెలకు కనీసం ఏడు గుడ్లు తింటున్నారని ఇండియన్ బ్రాయిలర్ గ్రూప్ ఎండీ గుల్రేజ్ ఆలం చెప్పారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ కోడిగుడ్ల వాడకానికి సానుకూల డిమాండ్ పెరిగింది. 2018-19లో ఒక్కొక్కరు సగటున 79 కోడిగుడ్లు తీసుకున్నారు. అది 2019-20లో 86కు చేరింది
గతేడాది కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన తర్వాత ఏప్రిల్, మే నెలల్లో కోడిగుడ్లు, చికెన్ వినియోగం తగ్గింది. జూన్-డిసెంబర్ మధ్య స్వల్పంగా మెరుగు పడింది. మళ్లీ బర్డ్ ఫ్లూ వల్ల ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పరిస్థితి దారుణంగా మారింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019-20లో 140 బిలియన్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరిగింది. అంతకుముందు సంవత్సరం అది 103 బిలియన్లే. దేశంలో 98 శాతం కోడిగుడ్ల వినియోగం జరుగుతన్నది.
1985-86లో 16.1 బిలియన్ల కోడిగుడ్లే ఉత్పత్తి అయ్యాయి. కరోనా మహమ్మారి వల్ల కోడిగుడ్ల బిజినెస్ 100 శాతం పెరిగింది. గత కొన్ని నెలలుగా రెట్టింపైంది. ప్రజల్లో తమ ఆరోగ్యం పట్ల, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై ఆసక్తి పెరగడమే దీనికి కారనం.
రిటైల్ మార్కెట్లో ఒక కోడిగుడ్డు ధర రూ.7-8 పలుకుతున్నది. ప్యాకేజ్డ్ బ్రాండ్ గుడ్డు కోసం రూ.10, అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తున్నది. అయితే, ప్రాంతాల వారీగా గుడ్డు ధర ఆధార పడి ఉంది.
ఇలాగైతే 2025 నాటికే అందరికీ వ్యాక్సిన్ : శివసేన
కేఎస్ఆర్టీసీ ఇక కేరళదే.. కర్ణాటకకు షాక్
కశ్మీర్ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..
ఉచిత కోవిడ్ శిబిరాన్ని ధ్వంసం చేసిన దుండగులు
జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దు.. సీబీఐ అధికారులకు కొత్త డైరెక్టర్ ఆదేశాలు
ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: ప్రభుత్వ అధ్యయనం
అత్యంత అందవిహీనమైన భాష కన్నడ అన్న గూగుల్.. క్షమాపణ చెప్పిన సంస్థ
కోవిన్ పోర్టల్లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
Medicinesలోకి Reliance: నిక్లోసామైడ్ వాడకానికి దరఖాస్తు
పూణే విమానాశ్రయం ద్వారా 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు రవాణా..
ఈటల రాజేందర్ను ఎవరూ కాపాడలేరు : ప్రభుత్వ విప్ గువ్వల
రూ.43000 కోట్లతో ఆరు సబ్మెరైన్ల నిర్మాణానికి ఆమోదం
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం