Yogi Adityanath | దేశానికి కాంగ్రెస్ పార్టీనే పెద్ద సమస్య అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress ) పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు. ‘దేశానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సమస్య. కర్ఫూలు విధించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమటిస్తే.. కాంగ్రెస్ మాత్రం ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించింది’ అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
అదే బీజేపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు కొదవలేదని యెగి అన్నారు. గత నాలుగేళ్లలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తోందని గుర్తు చేశారు. మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠ పెరిగిందన్నారు. ఉగ్రవాదం కూడా ముగిసిపోయిందన్నారు. దేశం మొత్తం మరోసారి మోదీ నాయకత్వం రావాలని నినదిస్తోంది అని యోగి పేర్కొన్నారు.
Also Read..
Jewellery | కర్ణాటకలో భారీగా పట్టుబడిన బంగారం, నగదు.. వీడియో
Engine Cover | విమానం గాల్లో ఉండగా ఊడిన ఇంజిన్ కవర్.. షాకింగ్ వీడియో
Allu Arjun | అర్ధరాత్రి అల్లు అర్జున్ ఇంటి వద్ద ఫ్యాన్స్ సందడి.. వీడియోలు