Jewellery | లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక (Karnataka) పోలీసులు భారీ స్థాయిలో బంగారం (Jewellery), నగదును స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి పట్టణంలో దాడులు చేపట్టిన పోలీసులు.. ఓ నగల దుకాణం యజమాని (jewellery shop owner) నరేశ్ ఇంట్లో ఏకంగా రూ.5.60 కోట్ల నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.
5 Crores Cash, 106 Kg Jewellery: #Karnataka Cops’ Crackdown Ahead Of Polls pic.twitter.com/kfMtXoRCbz
— Kredible Source (@KredibleSource) April 8, 2024
నగదుతోపాటు 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలతోపాటు 68 వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగలు, బంగారం విలువ రూ.7.60 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు దుకాణం యజమాని నరేశ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఇదంతా హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read..
Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. టీ20ల్లో 150వ విక్టరీ
Congress | ఒకటో తారీఖు జీతం ప్రచార ఆర్భాటమే.. సెర్ప్ ఉద్యోగులకు రెండు నెలలుగా అందని వేతనాలు
BJP | ఏ వాదం? ఏ నినాదం?.. లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతల మల్లగుల్లాలు