ముంబై: ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో 150 మ్యాచ్లు గెలిసిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. టీ20 ఫార్మాట్లో ఏ జట్టు కూడా అన్ని మ్యాచ్లు నెగ్గలేదు. ముంబైలో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నది. ఐపీఎల్తో పాటు ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీల్లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ జట్టు 273 మ్యాచ్లు ఆడింది. దాంట్లో 150 మ్యాచ్లను ఆ జట్టు నెగ్గగా, 117 మ్యాచుల్లో ఆ జట్టు ఓటమి పాలైంది. రెండు మ్యాచ్లకు ఫలితాలు దక్కలేదు. ఇక సూపర్ ఓవర్ వరకు వెళ్లిన మ్యాచుల్లో ముంబై జట్టు రెండు గెలవగా, మరో రెండింట్లో ఓటమి పాలైంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నది. ఆ జట్టు ఇప్పటి వరకు 148 మ్యాచ్లను గెలుచుకున్నది. టీ20ల్లో సీఎస్కే 253 మ్యాచ్లు ఆడింది. దాంట్లో 148 గెలువగా, 101 మ్యాచుల్లో ఓడింది. రెండు మ్యాచుల్లో ఫలితాలు రాలేదు. సూపర్ ఓవర్లో చెన్నై జట్టు రెండు మ్యాచ్లను ఓడింది. ఓ రెగ్యులర్ మ్యాచ్ టై చేసుకున్నది.