ఖమ్మం : జిల్లాలోని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన వెల్లంకి రాజశ్రీ అనే బాలిక గతేడాది డిసెంబర్ 17న కిడ్నాప్ కు గురైంది. కిడ్నాప్ అయిన ఆ బాలిక ఆచూకీ ఉత్తరప్రదేశ్లో లభ్యమైంది. ఎర్రుపాలెం ఎస్ఐ ఉదయ్ కిరణ్ చాకచక్యంగా వ్యవహరించి బాలికను కిడ్నాప్ చేసిన నిందితులను అరెస్టు చేశారు. మైనర్ను సురక్షితంగా రేమిడిచర్లకు తీసుకొచ్చారు ఎస్ఐ.
రేమిడిచర్లలో క్షుద్ర పూజలు నిర్వహించేందుకు వచ్చిన గుంటూరు పూజారి సూర్య ప్రకాష్ శర్మ మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్ చేసినట్లుగా విచారణలో తేలింది. ఈ కేసును చేధించి.. నిందితులను పట్టుకుని, బాలికను సురక్షితంగా తీసుకొచ్చిన ఎస్ఐ ఉదయ్ కిరణ్ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ఇవి కూడా చదవండి..