Dilip Ghosh | పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ బీజేపీ నేత, ఎంపీ దిలీప్ ఘోష్ (Dilip Ghosh)పై కేసు నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (CM Mamata Banerjee) అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ భారత శిక్షాస్మృతిలోని 504, 509 సెక్షన్ల కింద దుర్గాపూర్ పీఎస్లో కేసు నమోదైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు.
దీదీపై దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఏ రాష్ర్టానికి వెళ్తే ఆ రాష్ట్రం కుమార్తెనని మమతా బెనర్జీ చెపుతున్నారని, ఇంతకీ ఆమె తండ్రి ఎవరో స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. దిలీప్ వ్యాఖ్యలు రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర దుమారం రేపాయి. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. మరోవైపు టీఎంసీ ఫిర్యాదు మేరకు దిలీప్ ఘోష్కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాము పంపిన షోకాజ్ నోటీసులకు ఈ నెల 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు గౌరవంతో, హుందాగా వ్యవహరించాలని ఈసీ ఈ సందర్భంగా సూచించింది.
Case registered against West Bengal BJP MP Dilip Ghosh in Durgapur PS under sections 504 and 509 of the Indian Penal Code over his remarks on CM Mamata Banerjee.
— ANI (@ANI) March 28, 2024
Also Read..
Supriya Shrinate | కంగనపై వివాదాస్పద పోస్ట్ చేసిన సుప్రియా శ్రీనాతేకు షాకిచ్చిన కాంగ్రెస్
Leopard | అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం
Mahua Moitra | ఈడీ విచారణకు మూడోసారీ డుమ్మా.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ విచారణకు పిలవొద్దంటూ విజ్ఞప్తి