Supriya Shrinate | బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)పై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనాతే (Supriya Shrinate)కు కాంగ్రెస్ (Congress) పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ వివాదానికి తెరతీసిన నేపథ్యంలో ఆమెకు టికెట్ నిరాకరించింది.
2019లో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మహరాజ్గంజ్ (Maharajganj ) నుంచి సుప్రియా శ్రీనాతే పోటీ చేసిన ఓడిపోయిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి పంకజ్ చౌదరి చేతిలో ఓటమిపాలైంది. అయితే ఈ సారి ఎలాగైన అదే స్థానం నుంచి గెలవాలని భావించిన శ్రీనాతేకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. కంగనతో రాజకీయ వివాదం నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆమెను పక్కకు పెట్టేసింది. ఆమె స్థానంలో పార్టీ తరఫున వీరేంద్ర చౌదరికి (Virendra Chaudhary) అవకాశం కల్పించింది.
కాగా, ప్రముఖ బాలీవుడ్ నటి అయిన కంగనా రనౌత్కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి కంగనను బరిలోకి దింపింది. ఈ క్రమంలో కంగనకు సంబంధించి సోషల్ మీడియాలో సుప్రియా పెట్టిన ఓ అభ్యంతరకర పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కంగన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కంగనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సుప్రియాకు ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు అగౌరవంగా, దురుద్దేశంతో కూడుకుని ఉన్నాయని ఈసీ వ్యాఖ్యానించింది. తాము పంపిన షోకాజ్ నోటీసులకు ఈ నెల 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు గౌరవంతో, హుందాగా వ్యవహరించాలని ఈసీ ఈ సందర్భంగా సూచించింది.
Also Read..
Mahua Moitra | ఈడీ విచారణకు మూడోసారీ డుమ్మా.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ విచారణకు పిలవొద్దంటూ విజ్ఞప్తి
Leopard | అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం
Erode MP | టికెట్ ఇవ్వలేదని మనస్తాపం.. ఈరోడ్ ఎంపీ ఆత్మహత్య