Erode MP | లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎండీఎంకే (MDMK) పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ (Erode MP) గణేశమూర్తి (Ganeshamoorthy) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో గణేశమూర్తి మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
ఎండీఎంకే పార్టీలో కీలక నేత అయిన గణేశమూర్తి.. 2019 పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోడ్ నుండి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. అయితే, ఈ సారి ఎండీఎంకే పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎంపీ.. మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆయన్న కుటుంబ సభ్యులు వెంటనే కోవైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని.. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినట్లు వివరించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం కోయంబత్తూర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
#WATCH | Tamil Nadu: MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide.
Visuals from the hospital in Coimbatore as his body is being brought out. pic.twitter.com/1dQswss4uG
— ANI (@ANI) March 28, 2024
Also Read..
KU Mohanan | విజువల్స్లో సహజత్వం కనిపించాలంటున్న కేయూ మోహనన్
Lok Sabha Elections | రెండో విడుత నోటిఫికేషన్ విడుదల.. 88 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్లు షురూ
Trisha | అందుకే బాలీవుడ్ వద్దనుకున్నా: త్రిష