Mahua Moitra | విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా (Mahua Moitra) మరోసారి ఈడీ విచారణను దాటవేశారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు మహువాకు సమన్లు (summons) జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, నేడు విచారణకు మహువా హాజరుకావడం లేదు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కృష్ణానగర్ నుంచి పోటీ చేస్తున్న మహువా.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ తనను పిలవొద్దని ఈడీ అధికారులను కోరినట్లు తెలిసింది.
కాగా, ప్రశ్నలకు ముడుపుల కేసులో ఇంతకుముందు రెండు సార్లు మహువాకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు సార్లూ ఆమె విచారణకు హాజరుకాలేదు. ఇదే కేసులో మహువా మొయిత్రాపై యాంటీ కరప్షన్ అంబుడ్స్మన్ లోక్పాల్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సీబీఐ గత శనివారం మహువా నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఇంతలోనే ఈడీ ఆమెకు బుధవారం మూడోసారి సమన్లు పంపింది. గురువారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానికి కూడా సమన్లు పంపింది.
Also Read..
Leopard | అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం
Erode MP | టికెట్ ఇవ్వలేదని మనస్తాపం.. ఈరోడ్ ఎంపీ ఆత్మహత్య
Telangana | ఒడుపు లేక వరుణుడిపై నెపం.. నీటి యాజమాన్యంలో రాష్ట్ర సర్కారు విఫలం