డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. కారు లోయలో పడిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన బద్రీనాథ్ జాతీయ రహదారి 58పై జోషిమత్ ప్రాంతంలో శనివారం ఆలస్యంగా ఘటన చోటు చేసుకుంది. చమోలీ భీమ్తాలాలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా వంతెన సమీపంలో కారు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ సమయంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. జోషిమత్ ఎస్డీఎం ఆధ్వర్యంలో రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను లోయలో నుంచి వెలికి తీశారు. మృతులంతా స్థానికులు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో వంతెనన నిర్మిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇరువైపులా భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..