హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్టు ట్రై కార్ ఎండీ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపా రు. కేరళలోని కొచ్చిలో మే నెలలో శిక్షణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంయువతకు 25 సీట్లు కేటాయించారని తెలిపారు.
శిక్షణ తర్వాత సర్టిఫికెట్తోపాటు, ప్లేస్మెంట్ కల్పిస్తారని వెల్లడించారు. ఈ నెల 10లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. వివరాలకు <http://dsappo nline.com/sds/form/register.php>వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.