న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో తీవ్రమైన భద్రతాపరమైన లోపాలను గుర్తించినట్టు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) శనివారం ప్రకటించింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకొని హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడవచ్చని, సందేశాలు, ఫొటోలు వంటి వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని దొంగిలించవచ్చని హెచ్చరించింది. ‘ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ వర్షన్ v2.21.4.18కు ముందు ఉన్న వర్షన్లలో, ఐవోఎస్ ఫోన్లకు సంబంధించి v2.21.32 వర్షన్లలో లోపాలను గుర్తించాం. సైబర్ దాడులకు గురికాకుండా వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ను ఇన్స్టాల్ చేసుకోండి’ అని సెర్ట్-ఇన్ సూచించింది.