Parliament Breach | లోక్సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. బుధవారం లోక్సభలో భారీ భద్రతా వైఫల్యం బయటపడిన విషయం తెలిసిందే. శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జీరో అవర్లో ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించి కలర్ స్మోక్ వదులుతూ హంగామా సృష్టించారు. ఈ ఘటన నేపథ్యంలో విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఎగువ, దిగువ సభల్లో ఈ అంశంపై సభ్యుల నిరసన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి ( Adjourned).
నిన్న జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రతిపక్ష ఎంపీలు ఉదయం లోక్సభ (Lok Sabha)లో ఆందోళనకు దిగారు. సభలో జరిగిన కలర్ స్మోక్ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దిగువ సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
Lok Sabha adjourned till 2pm amid sloganeering by Opposition MPs over yesterday’s security breach incident. The opposition MPs also demanded the resignation of Union Home Minister Amit Shah over the incident
Lok Sabha Speaker Om Birla said “all of us are concerned” about what… pic.twitter.com/P20jMqEfO9
— ANI (@ANI) December 14, 2023
మరోవైపు ఎగువ సభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు కలర్ స్మోక్ ఘటనపై ఆందోళనకు దిగారు. హోం మంత్రి అమిత్ షా సభకు రావాలని.. ఘటనపై మాట్లాడాలంటూ పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఇక ప్రతిపక్ష నేతలు తన చాంబర్లో సమావేశం కావాలని చైర్మన్ కోరారు.
Rajya Sabha adjourned till 12 noon. The chairman has asked the Opposition leader for a meeting at his chamber at 11.30 am.
— ANI (@ANI) December 14, 2023
Also Read..
Rajnath Singh: స్మోక్ అటాక్పై లోక్సభలో రాజ్నాథ్ ప్రకటన
Parliament Breach | లోక్సభలో గందరగోళం… కలర్ స్మోక్ ఘటనపై విపక్ష సభ్యుల ఆందోళన
TS Assembly | అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్.. ప్రమాణస్వీకారం