హైదరాబాద్ : బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వంట బాగాలేదని భర్త, భార్యను( Wife) కొట్టి చంపాడు( killed). ఈ విషాదకర సంఘటన బాచుపల్లి పీఎస్(Bachupally PS) పరిధిలోని ప్రగతి కన్ష్ట్రక్షన్(Pragathi Construction) వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు కన్ట్ర్సక్షన్ లేబర్గా పని చేస్తున్నారు. కాగా, భార్య, భర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో
వంట బాగాలేదని భార్య రవినా దూబే(26)ని భర్తఇటుకతో(Brick) కొట్టి చంపాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.