Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ దక్షిణాదిలో సాఫ్..ఉత్తరాదిలో హాఫ్ అని విపక్ష ఇండియా కూటమి చేసిన వ్యాఖ్యలను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తోసిపుచ్చారు. విపక్షాలు భ్రమల్లో విహరిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడులో తమ ఓటు షేర్ పెరగడంతో పాటు అక్కడ కొన్ని స్దానాల్లో తాము విజయం సాధిస్తామని నడ్డా చెప్పారు. కర్నాటకలో గత లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయాలను నిలబెట్టుకుంటామని, ఈసారి ఏపీలోనూ మెరుగైన ఫలితాలు రాబడతామని చెప్పారు. ఒడిషా, పశ్చిమ బెంగాల్లోనూ తమ పార్టీ ముందుందని నడ్డా వివరించారు.
మధ్యప్రదేశ్, చత్తీస్ఘఢ్, రాజస్ధాన్ సహా ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో విపక్షాల ఉనికే లేదని, వారి అభ్యర్ధులు ఎక్కడా కనిపించరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ-ఎన్డీయే 400కుపైగా స్ధానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి డీలా పడిన విపక్షాలు నైరాశ్యంలో సమాజంలో విభజన చిచ్చును రాజేస్తున్నాయని ఆరోపించారు. ఏపీ, కర్నాటకలో వారేం చేశారనే రహస్య అజెండాను కాంగ్రెస్ మేనిఫెస్టో బట్టబయలు చేసిందని దుయ్యబట్టారు.
కర్నాటకలోని శివమొగ్గలో నడ్డా ఓ వార్తాసంస్ధతో మాట్లాడారు. ముస్లింల విషయంలో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఓటమి భయంతో విపక్షాలు సోషల్ మీడియాలో డీప్ఫేక్ వీడియోలను వ్యాప్తి చేస్తున్నాయని, రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ సీఎం ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో సదరు వీడియో అప్లోడ్ అయిందని దర్యాప్తు వెల్లడించిందని నడ్డా తెలిపారు.
Read More :
TS SSC Results | పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్