Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha) గత కొంతకాలంగా భారత్లో కనిపించడం లేదు. ముఖ్యంగా ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కూడా ఆయన ప్రత్యక్షం కాలేదు. దీంతో యంగ్ లీడర్ అదృశ్యంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కేసుల భయంతో ఆయన విదేశాలకు పారిపోయారంటూ పుకార్లు వ్యాపించాయి. అయితే, ఆ పుకార్లకు ఢిల్లీ మంత్రి (Delhi Minister) సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) తాజాగా పులుస్టాప్ పెట్టారు. కంటి శస్త్రచికిత్స (Eye Surgery) కోసం రాఘవ్ చద్దా యూకే వెళ్లినట్లు వెల్లడించారు.
ఈ మేరకు మంగళవారం మీడియాతో సౌరభ్ భరద్వాజ్ మాట్లాడారు. ‘రాఘవ్ గత కొంతకాలంగా కంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. చికిత్స కోసం యూకే వెళ్లారు. అక్కడ ఆయనకు మేజర్ కంటి శస్త్ర చికిత్స జరిగింది. ఇది చాలా తీవ్రమైనది. సకాలంలో చికిత్స అందించకపోతే అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. కోలుకున్న వెంటనే తిరిగి భారత్ వచ్చి పార్టీ ప్రచారంలో పాల్గొంటారు’ అని భరద్వాజ్ తెలిపారు.
VIDEO | “Raghav Chadha has undergone major eye surgery in the UK. It is said that his condition was serious and there was a possibility of blindness. As soon as he gets better, he will come back to India and join us in the election campaigning,” says Delhi Minister and AAP leader… pic.twitter.com/o3A0hJYrAt
— Press Trust of India (@PTI_News) April 30, 2024
Also Read..
Venezuela | విమానంలో పొగలు.. అత్యవసర స్లైడ్ ద్వారా బయటపడుతూ గాయాలపాలైన ప్రయాణికులు