TS Assembly | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసింది. శాసన సభ గురువారం ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుతో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్గా నియామకమైన గడ్డం ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసాద్తో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.