Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల దాడి తీవ్రతరం చేశారు. మహారాష్ట్రలోని లాతూర్లో మంగళవారం జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ వాయిదాల పద్ధతిలో ప్రధానులను అందించేవారు భారీ లక్ష్యాలను సాధించగలరా అని ప్రశ్నించారు. ఏటా ఓ ప్రధానిని వంతులవారీగా ఎన్నుకోవాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించిందని అన్నారు.
భారత్ను ముక్కలుగా చూడాలనుకునే వారు ప్రధాని పదవిని కూడా పంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేండ్లలో ఐదుగురు ప్రధానులను మార్చాలనే వారి ఆలోచనకు అర్ధం దేశాన్ని వంతులవారీగా లూటీ చేసేందుకేనని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఇక 2014కు ముందు ప్రతిరోజూ బాంబు పేలుడు ఘటనల గురించి వార్తాపత్రికల్లో హెడ్లైన్స్ వచ్చేవని ఇప్పుడు అలాంటి వార్తలకు చోటు లేకపోవడంతో పాటు భారత్ తన సరిహద్దులను కూడా దీటుగా కాపాడుకుంటోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో దేశం ఎంతగా నష్టపోయిందనే విషయాలను మోదీ వివరించారు. కాంగ్రెస్ హయాంలో రోజూ గుర్తుతెలియని వస్తువులపై హెచ్చరిస్తుండేవారని, కీలక ప్రదేశాల్లో రోజూ 24 గంటల పాటు ఇలాంటి హెచ్చరికలు ఉండేవని గుర్తుచేశారు. మోదీ ప్రధాని కాగానే ఈ తరహా వస్తువులు ఏమై పోయాయని ప్రశ్నించారు.
Read More :
TS SSC Results | పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్