హైదరాబాద్ : తెలంగాణలో నీటి కష్టాలు ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గుక్కెడు నీళ్లు కోసం జనం అల్లాడిపోతున్నారు. సాగు, తాగు నీరులేక ప్రజలు అరిగోస పడుతున్నాయి. మూగ జీవాల రోదనలు సరేసరి. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువుతో వాగులు, వంకలు ఎండిపోయాయి. చెరువులు నెర్రెలు వాసి, రిజర్వాయర్లు ఒట్టిపోయాయి. పాలనపై అనుభవంలేక, ఉన్ననీటిని వాడుకునే సోయిలేక పల్లెలు నీళ్ల కోసం తండ్లాడుతున్నాయి.
రాష్ట్రంలో నీటి ఎద్దడికి అద్దం పేట్టే సంఘటన నిర్మల్ జిల్లా బుధవార్పేట్ కాలనీలో చోటు చేసుకుంది. నీళ్ల కోసం కాలనీలో ఉన్న ఓ బావిలో దాదాపు 12 మోటార్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. ఆ బావిలో కూడా నీళ్లు అడుగంటిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంచి నీళ్లు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.