శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్ సమీపంలో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్లోని కన్మోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృంధాలపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారని, దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి