Earthquake | జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir)లో భూకంపం సంభవించింది. కిస్త్వార్ (Kishtwar) ప్రాంతంలో మంగళవారం ఉదయం 8:53 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదు. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది.
Also Read..
MS Dhoni | క్రికెట్ దిగ్గజానికి రాముడి ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం.. ఫొటో వైరల్
Crime News | పొరుగింటి వ్యక్తిని భార్య గుట్కా అడిగిందని.. గొంతు కోసుకున్న భర్త
Leopard | శంషాబాద్ శివారులో చిరుత సంచారం..! ఎంత వరకు నిజం..?