MS Dhoni : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయం(Lord Rama Temple) లో రాముడి ప్రాణ ప్రతిష్టకు మరో ఆరు రోజులే ఉంది. దాంతో, నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)తో పాటు ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)లకు ఆహ్వానాలు అందాయి. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి ఇన్విటేషన్ ముట్టింది.
జనవరి 22న జరిగే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు వచ్చేందుకు మహీ భాయ్ సంతోషంగా అంగీకరించాడు. సోమవారం ధోనీని కలిసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కో ప్రోవిన్స్ సెక్రటరీ ధనుంజయ్ సింగ్ ఆహ్వాన పత్రిక అందించారు. దాంతో, కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవానికి తనను పిలిచినందుకు ధోనీ అతడికి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఆ ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
आज प्रदेश महामंत्री (संगठन) श्री @bjpkarmveer जी और राष्ट्रीय स्वयंसेवक संघ के सह प्रांत कार्यवाह श्री धनंजय सिंह जी ने JSCA स्टेडियम में भारतीय क्रिकेट टीम के पूर्व कप्तान, झारखंड की शान श्री महेंद्र सिंह धोनी जी को अयोध्या में हो रहे राम मंदिर प्राण प्रतिष्ठा में शामिल होने के… pic.twitter.com/LXvQXOmPZK
— BJP JHARKHAND (@BJP4Jharkhand) January 15, 2024
హిందువుల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం సాకారమైంది. ఈ సందర్భంగా రాముడి ప్రాణ ప్రతిష్ట వేడకకు రామాలయ ట్రస్ట్ 7 వేల మందికి ఆహ్వానాలు పంపింది. వీళ్లలో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ దిగ్గజాలు కూడా ఉన్నారు. వీళ్లలో మాజీ సివిల్ సర్వీసెంట్లు, ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, ఇంద్రజాలికులతో పాటు పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డు విజేతలు ఉన్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది.
ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ను విజేతగా నిలిపిన ధోనీ మరో సీజన్కు రెడీ అవుతున్నాడు. మోకాలి సర్జరీ నుంచి కోలుకున్నతాలా ఈమధ్యే నెట్ ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ నాలుగేండ్ర క్రితం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. త్వరలోనే ఐపీఎల్కు కూడా గుడ్ బై చెప్పనున్నాడు. 17వ సీజన్తో మహీ భాయ్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.