బజాజ్ ఆటో మంగళవారం తన చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ తిరిగి ప్రారంభించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. రూ.2,000 రిజర్వేషన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వెహికల్ పోస్ట్ బుకింగ్ వారెంట్లు రద్దు ఛార్జీలు రూ.1,000 గా పేర్కొన్నారు.
బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లో క్రమంగా పెంచుతున్నది. 2020 డిసెంబర్ నాటికి, ఈ బైక్ను దేశంలోని మొత్తం 18 డీలర్షిప్ల నుంచి రిటైల్ చేయనున్నారు. వీటిలో ఐదు ఫుణెలో ఉండగా.. మిగిలినవి బెంగళూరులో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చేతక్ కోసం బజాజ్ ప్రణాళికలు కూడా ఉన్నాయి. వాహన తయారీదారు 2020 లో యూరప్ కోసం చేతక్ రూపకల్పనను అధికారికంగా నమోదు చేశారు. పేటెంట్ యూరోపియన్ యూనియన్ మేధో సంపత్తి కార్యాలయంలో నమోదు చేశారు. దీనికి 2029 నవంబర్ వరకు రిజిస్ట్రేషన్ చెల్లుబాటు మంజూరు చేయబడింది.
చేతక్ బ్రాండ్ 2020 ప్రారంభంలో భారతదేశంలో తిరిగి ప్రవేశపెట్టారు. అసలు చేతక్ స్కూటర్ల మాదిరిగా కాకుండా.. కొత్త మోడల్లో ఐసీఈ పవర్ట్రెయిన్కు బదులుగా ఎలక్ట్రిక్ మోటారు వచ్చింది. ఇదిలా ఉండగా, బజాజ్ ఆటో తన మొత్తం శ్రేణి ద్విచక్ర వాహనాల కోసం ఏప్రిల్ నెలలో కొత్త ధరల పెంపును ప్రకటించింది. దాని డొమినార్ శ్రేణి బైక్లు ఇప్పుడు భారతదేశంలో రూ.3,000 వరకు పెరిగాయి.
సెప్టెంబర్ నాటికి ముగియనున్న ఎయిర్ ఇండియా అమ్మకం..?!
కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డబ్ల్యూహెచ్ఓ
భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సింగర్
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయకండి..!
గ్రీన్ కార్డుల కోసం కేపిటల్ హిల్ వద్ద భారత వైద్యుల ఆందోళన
టిబెట్ సరిహద్దుల్లో 5 జీ నెట్వర్క్ విస్తరిస్తున్న చైనా
రెండేండ్లలో పెరిగిన బంగారం దిగుమతి
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
మధ్యప్రదేశ్లో ఆక్సిజన్ కొరత.. ఒకేరోజు నలుగురు మృతి
జలియన్ వాలా బాగ్ మారణకాండ.. బ్రిటిషర్ల దురాగతానికి 102 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..