పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాను కరోనా వణికిస్తున్నది. దీంతో జిల్లావ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలుచేస్తున్నారు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో ఈ నెల 9 వరకు జిల్లాలోని ప్రార్థనా స్థలాలన్నీ మూతపడ్డాయి. శనివారం ఎలాంటి ఆలయాలు తెరచుకోలేదు. దీంతో భక్తులు ఆలయాల వెలుపల నుంచే ప్రార్థనలు చేసుకుంటున్నారు.
కాగా, జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా రోజు 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు వెలుగులోకివస్తున్నాయి. దీంతో నేటి నుంచి ఏడు రోజులపాటు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, బార్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కర్ఫ్యూ సమయంలో మందులు, ఆహార పదార్థాలు హోం డెలివరీకి, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామని పుణె డివిజనల్ కమిషనర్ సురభ్ రావ్ తెలిపారు.
మహారాష్ట్రలో నిన్న 47,913 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.9 లక్షలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 481 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..