నెపితా: మయన్మార్ సైన్యం నిరసనకారులను అణిచివేస్తున్నది. కొన్ని చోట్ల ఇంటర్నెట్ను బ్లాక్ చేసింది. ఆన్లైన్ సైన్యాన్ని విమర్శిస్తున్నవారిని అరెస్టు చేస్తున్నారు. జుంటా అధికారులు విచక్షణారహితంగా ఆందోళనకారుల్ని అడ్డుకుంటున్నారు. ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న సైన్యానికి వ్యతిరేకంగా మయన్మార్లో నిరసనలు హోరెత్తుతున్న విషయం తెలిసిదే. అయితే ఇప్పటి వరకు జరిగిన సైనిక కాల్పుల్లో 550 మంది మృతిచెందినట్లు ద అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్(ఏఏపీపీ) పేర్కొన్నది. సైనిక బలగాల కాల్పుల్లో మృతిచెందినవారిలో 46 మంది చిన్నారులు ఉన్నారు. ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని సైన్యం స్వాధీన పరుచుకున్న విషయం తెలిసిందే.