Arvind Kejriwal | కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill)కు మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రాహుల్ సహా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge )కు లేఖ రాశారు.
కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లును తిరస్కరించి.. తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు
రాహుల్, ఖర్గేకి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుకు ఢిల్లీలోని కోట్లాది ప్రజల తరఫున
కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. పార్లమెంటు లోపల, వెలుపల ఢిల్లీ ప్రజల హక్కుల కోసం
పోరాడుతున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భారత రాజ్యాంగం పట్ల కాంగ్రెస్
పార్టీకి ఉన్న నిబద్ధత దశాబ్దాలుగా గుర్తుండిపోతుందన్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్న శక్తులకు
వ్యతిరేకంగా జరిపే పోరాటంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ మద్దతివ్వాలని కోరుకుంటున్నట్లు కేజ్రీవాల్ తన లేఖలో
పేర్కొన్నారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వాధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం
కల్పించే ‘ఢిల్లీ కేంద్ర రాజధాని ప్రాంత ప్రభుత్వం (సవరణ) బిల్లు-2023’కు పార్లమెంట్ లో ఆమోదం
లభించిన విషయం తెలిసిందే. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఓట్లు వేయగా.. వ్యతిరేకంగా 102 ఓట్లు
వచ్చాయి. కాగా, దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత ఇది చట్టంగా అమల్లోకి వస్తుంది.
Also Read..
Mukesh Ambani | లగ్జరీ ఇంటిని అమ్మేసిన ముకేశ్ అంబానీ..! ఎన్ని కోట్లకంటే..?
Shahbaz Sharif | తోషాఖానా బహుమతులను వేలం వేయనున్న పాక్.. ప్రకటించిన ప్రధాని షెహబాజ్