Mukesh Ambani | భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త, ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా పేరుగాంచిన
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తనకు చెందిన ఓ లగ్జరీ ఇంటికి ముకేశ్ విక్రయించారన్నది ఆ వార్త సారాంశం. అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన ఆస్తులు, విలాసవంతమైన ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తనకున్న లగ్జరీ ఇళ్లలో ఒకదాన్ని అంబానీ తాజాగా విక్రయించినట్లు సమాచారం.
న్యూయార్క్ ( New York) లోని మాన్హట్టన్ (Manhattan)లో అంబానీకి ఓ విలాసవంతమైన ఇల్లు
(luxurious apartment) ఉంది. ఆ ఇంటిని తాజాగా విక్రయించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
మాన్హట్టన్ వెస్ట్ విలేజ్లో గల ఓ అపార్ట్మెంట్లోని నాలుగో ఫ్లోర్ లో 2,406 చదరపు అడుగుల
విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఇంటిని అంబానీ 9 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు పేర్కొంది. అంటే మన
భారత కరెన్సీ ప్రకారం.. రూ.74.5 కోట్లన్న మాట.
ఈ లగ్జరీ ఇల్లు ప్రముఖ హడ్సన్ నదీ తీరాన ఉంది. ఇందులో రెండు బెడ్రూమ్ లు ఉన్నాయి. నది చుట్టూ
ప్రకృతి అందాలను చూసే విధంగా ఈ ఇంటిని అద్భుతంగా నిర్మించారు. లోపల కూడా అత్యాధునిక
సౌకర్యాలతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్ను అత్యద్భుతంగా రూపొందించారు.
పది అడుగుల ఎత్తులో సీలింగ్స్, హెరింగ్బోన్ హార్డ్వుడ్ ఫ్లోర్స్, బయటి శబ్ధాలు లోపలికి వినిపించకుండా
నిరోధించే కిటికీలు వంటి లేటెస్ట్ సౌకర్యాలు ఉన్నాయి.
Also Read..
Mahesh Birthday | మహేష్ కు మంత్రి కేటీఆర్ స్పెషల్ విషెస్