Students | మహారాష్ట్రలో (Maharashtra school) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు (biscuits) తిని సుమారు 150 మందికిపైగా విద్యార్థులు (Students) ఆసుపత్రిపాలయ్యారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.
ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేకేట్ జల్గావ్ గ్రామంలోని పాఠశాలలో శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా పిల్లలకు బిస్కెట్లు అందించారు. అవి తిన్న కొద్దిసేపటికే పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వికారం, వాంతులతో ఇబ్బంది పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, గ్రామ పెద్దలు వెంటనే పిల్లల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
‘శనివారం ఉదయం 8:30 గంటలకు బిస్కెట్లు తిన్న తరువాత 257 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. వారిలో 153 మందిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స అనంతరం కొంతమంది విద్యార్థులను ఇంటికి పంపాం’ అని వైద్యాధికారి డాక్టర్ బాబాసాహెబ్ ఘుఘే తెలిపారు. కాగా, పాఠశాలలో మొత్తం 296 మంది విద్యార్థులు ఉన్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్కు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Also Read..
Pune | పూణెలో భారీ వర్షం.. రైల్వే స్టేషన్ను ముంచెత్తిన వరద
India Day Parade | న్యూయార్క్లో ఘనంగా ఇండియా డే పరేడ్.. ఆకట్టుకున్న అయోధ్య రామ మందిరం నమూనా
Sand Art | రాఖీ పౌర్ణమి.. పూరీ తీరంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం