డెహ్రాడూన్: మరణించిన వ్యక్తి అంత్యక్రియల తర్వాత తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పింది. లోతైన లోయలో అది పడింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. (Vehicle Falls Into Gorge) ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఘన్సాలిలోని త్యోల్ధర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించాడు. సుమారు పది మంది గ్రామస్తులు హరిద్వార్లో అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, బోలెరో క్యాంపర్ వాహనంలో గ్రామానికి వారు తిరిగి వెళ్తున్నారు. గురువారం చంబా ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో ఆ వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో లోతైన లోయలో అది పడిపోయింది. ఆ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు ఈ ప్రమాదంలో ఎనిమిది మంది వ్యక్తులు మరణించారు. వారి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
Also Read:
Watch: పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన పెద్ద ఏనుగు.. తర్వాత ఏం జరిగిందంటే?