Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు, ఆర్మీ అధికారులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో జవాన్ల మృతి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో జవాను తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.
మంగళవారం జమ్మూలోని తోటగాలి ప్రాంతంలో ఆర్మీ ట్రక్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ దాడికి పాల్పడిన వారు రాజౌరి (Rajouri ) జిల్లాలోని కండి ఫారెస్ట్ ప్రాంతంలో ( Kandi Forest area) ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి ఆర్మీకి సమాచారం అందింది. దీంతో గురువారం నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆపరేషన్లో భాగంగా శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదుల జాడను ఆర్మీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆర్మీ అధికారులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు.
ఈ పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఓ అధికారి సహా నలుగురికి గాయాలైనట్లు తెలిపారు. గాయపడినవారిని వెంటనే ఉదంపూర్లోని కమాండ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
J&K | Five soldiers lost their lives in the encounter ongoing in Kandi area of Rajouri. Senior officials have reached the spot.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/3sIKz28Wus
— ANI (@ANI) May 5, 2023
Also Read..
Tim Cook | యాపిల్ రికార్డు స్థాయి వృద్ధి.. భారత్ అద్భుతమైన మార్కెట్ అన్న టిమ్ కుక్
SCO dinner | ఎస్సీవో విందులో ఆసక్తికర పరిణామం.. పాక్ మంత్రితో జయశంకర్ షేక్హ్యాండ్
Meesho Lay Off | ఉద్యోగులకు మీషో మరోసారి షాక్.. 251 మందికి ఉద్వాసన