భువనేశ్వర్: విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం (Vistara Flight) వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్నది. విమానం విండ్షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో ఉన్న 169 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్తోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ టు ఢిల్లీ విమానం టేకాఫ్ అయిన పది నిమిషాల్లో తిరిగి ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
కాగా, వడగళ్ల వాన వల్ల విస్తారా విమానం దెబ్బతిన్నదని బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. వడగళ్ల వల్ల విమానం విండ్షీల్డ్ పగుళ్లిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. విమానంలోని 169 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.