Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): విలాసవంతమైన గృహాల కార్యకలాపాల్లో హైదరాబాద్కు మూడో స్థానం లభించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మొదటి స్థానంలో ఉండగా, రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానం హైదరాబాద్కు దక్కిందని సీబీఆర్ఈ తాజాగా వెల్లడించింది.
ఇండియా మార్కెట్ మానిటర్ క్యూ1-2024 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. రూ.4 కోట్ల నుంచి రూ.20 కోట్ల లోపు విలువచేసే వ్యక్తిగత గృహాలు, అపార్ట్మెంట్లు అమ్మకాలు 10 శాతం వృద్ధిని సాధించాయి.