SCO dinner | భారత్ నేతృత్వంలో గోవా (Goa ) వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (Shanghai Cooperation Organisatio) మీటింగ్ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు వివిధ దేశాల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ మీటింగ్కి పాకిస్థాన్ (Pakistan) విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ( Bilawal Bhutto) కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీటింగ్కు హాజరైన ప్రతినిధుల కోసం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం విందు (SCO dinner) ఏర్పాటు చేసింది. ఈ విందులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ మంత్రి భుట్టోకు.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (Jaishankar) మర్యాదపూర్వకంగా షేక్హ్యాండ్ (shook hands) ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నట్లు సమావేశానికి హాజరైన వారు వెల్లడించారు. ఎస్ఈవో సమావేశంలో భారత్తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండబోవని పాక్ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మంత్రులు షేక్హ్యాండ్ ఇచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆసక్తికరంగా మారింది.
Also Read..
Earthquake In Japan | జపాన్లో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో కంపించిన భూమి
Meesho Lay Off | ఉద్యోగులకు మీషో మరోసారి షాక్.. 251 మందికి ఉద్వాసన
DRDO Scientist Arrest | పాక్కు భారత రహస్య సమాచారం లీక్ చేసిన శాస్త్రవేత్త అరెస్ట్