Tim Cook | భారత మార్కెట్పై యాపిల్ సీఈవో (Apple CEO) టిమ్ కుక్ (Tim Cook) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాపిల్కు భారత్ ‘అద్భుతమైన మార్కెట్’ అని కొనియాడారు. మార్చితో ముగిసిన మూడు నెలల వ్యవధిలో భారత్లో యాపిల్ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాపిల్ త్రైమాసిక ఫలితాలను సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు.
భారత్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న యాపిల్ (Apple) ఇటీవల ఇక్కడ రెండు రిటైల్ స్టోర్లను (retail outlets) ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు ఏడేండ్ల తర్వాత భారత్లో పర్యటించిన టిమ్ కుక్ గత నెలలో ముంబై, ఢిల్లీ నగరాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రిటైల్ మార్కెట్ స్టోర్లను తెరిచారు. ఈ సందర్భంగా భారత్లో యాపిల్ సాధిస్తున్న ఫలితాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయన్నారు.
మార్చిలో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పనితీరుపై టిమ్ కుక్ తాజాగా మాట్లాడారు. మార్చితో ముగిసిన మూడు నెలల వ్యవధిలో భారత్లో యాపిల్ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. వార్షికంగా చూస్తే రెండంకెల వృద్ధితో బలమైన ఫలితాలు నమోదయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. తమ కంపెనీ ప్రధానంగా భారత మార్కెట్పై దృష్టిపెట్టిందని అన్నారు. యాపిల్ బ్రాండ్పై ఇక్కడి ప్రజలకు ఉన్న ఆసక్తిని తాను ఇటీవలి పర్యటనలో గమనించినట్లు టిమ్ కుక్ వివరించారు.
Also Read..
DRDO Scientist Arrest | పాక్కు భారత రహస్య సమాచారం లీక్ చేసిన శాస్త్రవేత్త అరెస్ట్
Meesho Lay Off | ఉద్యోగులకు మీషో మరోసారి షాక్.. 251 మందికి ఉద్వాసన
SCO dinner | ఎస్సీవో విందులో ఆసక్తికర పరిణామం.. పాక్ మంత్రితో జయశంకర్ షేక్హ్యాండ్