Bihar Elections | బీహార్ శాసనసభ ఎన్నికల (Bihar Assembly Elections) ఆఖరి విడత (final phase) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట వరకూ 47.62 శాతం మేర ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 45 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో సీఎం నితీశ్ కుమార్ మంత్రివర్గంలోని 12 మంది మంత్రులు కూడా పోటీలో ఉన్నారు. ఇక ఈ నెల 6న తొలి దశలో 121 స్థానాలకు పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నెల 14 అన్ని నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
47.62% approximate voter turnout recorded in the second and final phase of #BiharElection2025, till 1 pm. pic.twitter.com/Lb0D5ycvsk
— ANI (@ANI) November 11, 2025
Also Read..
Rajesh Agrawal | ఢిల్లీ బాంబు పేలుడు ప్రదేశాన్ని పరిశీలించిన సీఆర్పీఎఫ్ ఐజీ.. Video
Ayodhya |ఈ నెల 25న అయోధ్యకు ప్రధాని నరేంద్ర మోదీ