IED Blast | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు (CRPF jawans) తీవ్రంగా గాయపడ్డారు. సుక్మా (Sukma) జిల్లాలోని కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల సలాటోంగ్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్లోని కోబ్రాకు చెందిన ఇద్దరు కమాండోలకు తీవ్ర గాయాలయ్యాయి. జవాన్లు అక్కడ జరుగుతున్న రహదారి నిర్మాణ పనుల వద్ద విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లకు శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని విమానంలో ఆసుపత్రికి తరలించారు.
Also Read..
Mahua Moitra | లోక్సభ నుంచి బహిష్కరణ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా
Supreme Court | అప్పట్లోగా జమ్మూకశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలి : సుప్రీం కోర్టు
Amazon | ఆన్లైన్ ద్వారా సోనీ హెడ్ఫోన్స్ ఆర్డర్ చేస్తే.. టూత్పేస్ట్ వచ్చింది..!