Mahua Moitra | పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ పార్టీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) సోమవారం సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. తనను లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే (expulsion as MP). అదానీ గ్రూప్ గురించి పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు మహువా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ (Darshan Hiranandani) నుంచి డబ్బులు , విలువైన బహుమతులు తీసుకుందంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై ఆయన లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఈ కేసులో హీరానందానీ అప్రూవర్గా మారారు. ప్రశ్నలు అడిగేందుకు తాను ఎంపీ మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఆరోపించారు. కృష్ణా నగర్ ఎంపీ అయిన మహువా మొయిత్రా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీని దూషించి ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. తాను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా పార్లమెంట్ లాగిన్ ఉపయోగించానని అక్టోబర్ 19న తెలిపారు. ఈ ఆరోపణలపై లోక్సభ ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న విచారణ జరిపి హీరానందానీ ఆరోపణలు నిజమేనని తేల్చింది. మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదన చేస్తూ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్సభ నుంచి మహువాను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు.
Also Read..
Supreme Court | అప్పట్లోగా జమ్మూకశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలి : సుప్రీం కోర్టు
Amazon | ఆన్లైన్ ద్వారా సోనీ హెడ్ఫోన్స్ ఆర్డర్ చేస్తే.. టూత్పేస్ట్ వచ్చింది..!
Article 370 | ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు