Assembly elections | మహారాష్ట్ర, ఝార్ఖండ్ (Jharkhand)లో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తొలి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, రాజ్కుమార్ రావు, రితేశ్ దేశ్ముఖ్ తదితరులు ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రస్తుతం మహారాష్ట్రలో పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకూ కేవలం 6.61 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ 9 గంటల వరకూ 12.71 శాతం పోలింగ్ నమోదైంది.
12.71% voter turnout recorded till 9 am in the second and final phase of #JharkhandElection2024
6.61% recorded till 9 am in #MaharashtraElection2024 pic.twitter.com/J2FPub6C8U
— ANI (@ANI) November 20, 2024
మహారాష్ట్రలో(Maharashtra) మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మాక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 23 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
మరోవైపు ఝార్ఖండ్లో(Jharkhand) రెండు విడుతల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడత నవంబర్ 13వ తేదీన 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా38 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో సీఎం హేమంత్ సొరేన్, ఆయన భార్య కల్పనా సొరేన్, విపక్ష బీజేపీ నేత అమర్ కుమార్ బౌరీ సహా 528 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, 31 సమస్యాత్మక ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఝార్ఖండ్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
Also Read..
Maharashtra Polls: మహారాష్ట్రలో పోలింగ్.. ఓటేసిన సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ
AR Rahman: భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్
Cholesterol | కొలెస్ట్రాల్ను 86% మేరకు తగ్గించే పిల్