ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Maharashtra Polls) ఇవాళ జరుగుతోంది. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. భార్య అంజలీ, కూతురు సారా కూడా ఓటేశారు. ఓటేసిన తర్వాత వాళ్లు మీడియా ముందు ఇంకుతో ఉన్న వేలిని చూపించారు. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, రాజ్కుమార్ రావు కూడా ఇవాళ ఉదయమే ఓటు వేశారు. ఓటేసిన తర్వాత సచిన్ మీడియాతో మాట్లాడుతూ.. గత కొంత కాలం నుంచి భారత ఎన్నికల సంఘానికి ఐకాన్గా ఉన్నానని, ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నానని, ఇది మన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు ఆ బాధ్యతను స్వీకరించి, వచ్చి ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని ఆయన కోరారు.
#WATCH | Mumbai: Former Indian Cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar and their daughter Sara Tendulkar, show their inked fingers after casting vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/ZjHix46qmb
— ANI (@ANI) November 20, 2024