మక్తల్ టౌన్, జూన్ 24 : కరోనా నుంచి రక్షణ కల్పించేది వ్యాక్సిన్ ఒక్కటే అని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తాలా అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో సందీప్ మఖ్తాలాకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టానని, టీటా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి వ్యాక్సినేషన్ వేయించామని పేర్కొన్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు టీకాలు వేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కరోనా సమయంలో వైద్య సేవలు అందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.