వనపర్తి/పెబ్బేరు, మే 7 : ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రె డ్డి విమర్శించారు. వనపర్తి మండలం మెంటపల్లిలో, పెబ్బేరు మండలం శాఖాపురం, తోమాలపల్లెలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి ఐదు నెలలు పూర్తవుతున్నా.. ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని.. గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలే అమలవుతున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే హామీలు నెరవేర్చుతామని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నాడని.. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
పేదల కుటుంబాలలో వెలుగులు నిండాలంటే ఆర్ఎస్పీ ఎంపీగా గెలవాలన్నారు. కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కలగాలంటే బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలన్నారు. ఇప్పటి వరకు స్థానికేతరులే ఎంపీగా కొనసాగారని, ఈసారి స్థానికుడు, అలంపూర్కు చెం దిన ఆర్ఎస్పీని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఆయా కార్య క్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, సింగిల్విండో అధ్యక్షుడు ర ఘువర్ధన్రెడ్డి, మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ విజయ్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, వైస్ ఎంపీపీ బాలచంద్రారెడ్డి, మండలాధ్యక్షుడు రాములు, నాయకులు మాధవ్రెడ్డి, నర్సింహ, మహేశ్వర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, రాము, రామకృష్ణ, తిరుమలయ్య, వెంకటేశ్, శ్రీను, వెంకటేశ్, మధు, వీరస్వామి తదితరులున్నారు.