గద్వాల, మే 7 : మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి.. వాటిని అమలు చేయలేక బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అ భ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా గద్వాల మున్సిపాలిటీలోని 16, 17, 18, 20, 21, 31వ వార్డుల్లో ఎమ్మెల్యే సమావేశాలు నిర్వహించి మా ట్లాడారు. బీఆర్ఎస్తోనే తెలంగాణలో అభివృద్ధి జ రిగిందని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆగమై నానా అవస్థలు పడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో నూతన బస్టాండ్తోపాటు సమీకృత కూరగాయల మార్కెట్, ఇం డోర్ ఆడిటోరియం, సెంట్రల్ లైటింగ్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పార్లమెంట్ ఎ న్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రంతో పాటు దేశం కూడా అధోగతి పాలవుతుందని గుర్తు చేశారు. ప్ర జా సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. సీఎం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరగడానికి, ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవడానికే సమయం సరిపోతుందని.. ప్రజల బాగోగులు ఎలా పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. గురుకులాల కార్యదర్శిగా ఎంతోమంది విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వే సిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు బాబర్, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, మురళి, దౌలు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, వేణుగోపాల్, రామకృష్ణశెట్టి, గోవిందు, సాయిశ్యాంరెడ్డి, వంశీ, ధర్మానాయుడు తదితరులు పాల్గొన్నారు.