అచ్చంపేట టౌన్, మే 7 : అచ్చంపేటలో బుధవారం నిర్వహించే రోడ్ షోకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని.. ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలో ఆయన విలేకరులతో సమావేశమై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసి మోసపోయామని ప్రజలకు తెలిసొచ్చిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో భాగంగా తాము నిర్వహిస్తున్న రోడ్ షోలకు ప్రజలు భారీగా హాజరవడాన్ని జీర్ణించుకోలేని ఇతర పార్టీలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నాయన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమం త్రి హోదాలో ఉండి కేసీఆర్ను లేకుండా చేస్తామన డం.. బీఆర్ఎస్ను అంతమొందిస్తాననడం విడ్డూరంగా ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఆ లోచనలు మాని.. ప్రతిపక్షాలపై ఆరోపణలు చే యడం సరికాదన్నారు. అమలు కాని హామీలతో ప్ర జలను మోసం చేసి గద్దెనెక్కి, వాటిని అమలు చే యడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని బహిరంగ స భల్లో జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశా రు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పోలీస్ శాఖలో అత్యున్నత స్థానాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నాడన్నారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంట్కు పంపే బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే రోడ్షోకు ప్రజలు భారీగా హాజరు కా వాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, అమీనొద్దీన్, రవీందర్రావు, కౌన్సిలర్లు రమేశ్రావు, కుతుబుద్దీన్ తదితరులున్నారు.
అచ్చంపేట, మే 7 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం అచ్చంపేటకు వస్తుండడం తో ఎన్టీఆర్ స్టేడియంలో హెలీప్యాడ్ స్థలాన్ని గు వ్వల బాలరాజు పరిశీలించారు. మధ్యాహ్నం మూడు గంటలకు మసీదు నుంచి రోడ్ షో ప్రారంభమవుతుందని, బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, నాయకులు అమీనుద్దీన్, కౌ న్సిలర్లు రమేశ్రావు, కుతుబుద్దీన్, శంకర్ మాదిగ, రవి తదితరులు పాల్గొన్నారు.