నారాయణపేట టౌన్, జూన్ 7: హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఎస్డీఐఎఫ్(సోషల్ డేటా ఇంటిటివ్స్ ఫోరం) సభ్యులు సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ హరిచందన సమక్షంలో ఆక్సిజన్ సిలిండర్లను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ కొవిడ్ బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఆక్సిజన్ సిలిండర్లను ఎస్డీఐఎఫ్ సభ్యు లు అందజేయడం అభినందనీయమన్నారు. సంస్థ డైరెక్టర్ ఆజంఖాన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెంది న దవాఖానలకు ఆక్సిజన్ సిలిండర్లను అందజేశామని, ఇందులో భాగంగా పేట జిల్లా దవాఖానకు 10 ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లను వితరణ చేసినట్లు చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన సంస్థ సభ్యులకు డీఐవో శైలజ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఆసియాఖాన్, ఫెరోజ్ఖాన్, ఇబ్రహీంఖాన్, డా.రంజిత్కుమార్ పాల్గొన్నారు.