రామగిరి: డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకై ఉన్నత విద్యామండలి నిర్వహించిన ప్రక్రియల్లో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలతోనే దోస్త్ కట్టారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మన సర్కార్ విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ఆ దిశగా నిధులు కేటాయించడం, నూత న భవనాల నిర్మాణాలు, మౌలిక వసతులను అమలు చేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభు త్వ విద్యకు సై అంటు ముందుకు సాగుతుండటం విశేషం. నల్లగొండలోని మహాత్మాగాందీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 91 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళా శాలలు ఉండగా వాటిలోని 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్( డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ)తొలివిడతలో అడ్మిషన్ల జోరుకొనసాగింది. అత్యధికంగా ఎన్జీలో, ద్వితీయంగా ఉమెన్స్లో విద్యార్థులు చేరగా నూతనంగా హలియాలో ఏర్పాటైన కళాశాల సహితం అడ్మిషన్లలో ముందడులో ఉండటం గమనార్హం.
తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో పారదర్శకంగా అడ్మిషన్ల నిర్వహణకై రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్తో ఆన్లైన్లో అడ్మిషన్లు నిర్వహిస్తుంది. 2021-22 విద్యా సం. నిర్వహించిన అడ్మిషన్ల తొలి విడుత ప్రక్రియ ముగియడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలో దాదాపు ప్రతి కళాశాలలో 76శాతం కంటే అధికంగానే అడ్మిషన్లు కావడం విశేషం. ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కల్పిస్తున్న వసతులే దర్పణం పడుతున్నాయని అటు విద్యార్థులు మరో వైపు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 11 ఫ్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో …
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంజీయూ పరిధిలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటితో పాటు మరో రెండు ఎయిడెడ్ కళాశాలు కూడా ఉన్నాయి. వీటిలో అడ్మిష న్ల ప్రక్రియకై నిర్వహించి దోస్త్ తొలి విడుత అడ్మిషన్ల చేరికల గడు వు ముగియంతో ప్రభుత్వ కళాశాలలో అత్యధికంగా విద్యార్థులు చేరడం గమనార్హంగా చెప్పవచ్చు. అత్యధికంగా నల్లగొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో, ద్వితీయంగా ఫ్రభుత్వ మహిళా కళాశాల -నల్లగొండలోని విద్యార్థులు చేరారు. ఈ సంవత్సరం హలియాలో నూతనం గా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సహితం విద్యార్థులు చేరడా నికి మొగ్గు చూపడంతో 84శాతం సీట్లు నిండాయి.
తొలి విడుతలో 2,911 సీట్లు భర్తీ…
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులో 5,700 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తొలి విడుతలో 3,777సీట్లు భర్తీ కాగా ఆయా కళాశా లల్లో 2,911 మంది విద్యార్థులు తొలి విడతలో ఆన్లైన్లో సెల్ప్ రిపోర్టింగ్ చేసి చేరారు. అయితే దోస్త్ రెండో, మూడో విడుత పూర్తి అయ్యే సరికి ఈ కళాశాలలో 100శాతం అడ్మిషన్లు పూర్తి అవుతాయని తెలుస్తుంది. ఎన్జీ, ఉమెన్స్ కళాశాలకు అత్యధిక పోటీ కొనసాగింది.
25 నుంచి దోస్త్ రెండో విడుత అడ్మిషన్లు షురూ..!
దోస్త్ రెండో విడుత అడ్మిషన్లు ఈనెల 25నుంచి ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి దోస్త్ విభాగం వెల్లడించింది. తొలి విడుతలో సీట్లు రాని విద్యార్థులు రెండో విడుతలో రిజిస్ట్రేషన్స్ చేసుకుని ఆన్లైన్లో కళాశాల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండో విడుతలో సహితం ప్రభుత్వ కళాశాలల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతారని తెలుస్తుంది.