నల్లగొండ, మే 5 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పాలనను సరిగ్గా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని, లేదంటే వాటిని తుంగలో తొక్కుతుందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో ఆదివారం ఉదయం మార్నింగ్ వాకర్స్ను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం, మంత్రులు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం తప్ప.. పాలన గురించి పట్టించుకోవడం లేదన్నారు.
బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే ఈ ప్రభుత్వం నిద్ర లేచి ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉన్నదని, లేదంటే పూర్తిగా వదిలేస్తుందని పేర్కొన్నారు. తాను నాయకుడిని కాదు.. సేవకుడినని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం టీ కొట్టులో చాయ్ చేసి పోశారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నాయకులు లొడంగి గోవర్ధన్, మెరుగు గోపి, రావుల శ్రీనివాస్రెడ్డి, వీరాచారి, రాజేందర్, రమేశ్, భాసర్, అమర్, సతీశ్, కిరణ్, సురేశ్ పాల్గొన్నారు.