వినాయక్నగర్ : కరోనా వ్యాక్సిన్ అందరికీ ఇస్తామని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి అన్నారు. సోమవారం మారుతీనగర్ కాలనీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న సంక్షేమ సంఘం నాయకులను అభినందించారు. ఈ సందర్భంగా డీసీ నాగమణి మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ పట్ల అపోహలు వద్దని అన్నారు. ఇంటింటికీ వచ్చిన ఆరోగ్య శాఖ సిబ్బందికి వివరాలు తెలిపి మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సంపత్కుమార్, సాయికిరణ్, భానురెడ్డి, కిరణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.